ఆసుపత్రి నుంచి శర్వానంద్ డిచార్జ్
హైదరాబాద్: ఇటీవల బ్యాంకాక్లో జరిగిన షూటింగ్లో గాయాలపాలైన సినీ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్లోని సన్షైన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్లో షూటింగ్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో..రాంగ్ ల్యాండింగ్ అవ్వడంతో.. అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకొని సన్షైన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. […]
హైదరాబాద్: ఇటీవల బ్యాంకాక్లో జరిగిన షూటింగ్లో గాయాలపాలైన సినీ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్లోని సన్షైన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్లో షూటింగ్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో..రాంగ్ ల్యాండింగ్ అవ్వడంతో.. అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకొని సన్షైన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. గాయం పెద్దది కావడంతో అతనికి రెండు నెలల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. గాయం తీవ్రత తగ్గడంతో ఈ రోజు శర్వానంద్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, శర్వానంద్కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’ సినిమాల షూటింగ్కు అంతరాయం ఏర్పాడింది.