Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్
అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. నవంబర్ 12న జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. సీఎంను దూషించిన కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ రిమాండ్ ఆదేశాలు జారీ అయ్యాయి. పీటీ వారెంటుపై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరులోని ఎక్సైజ్ కోర్టుకు తీసుకొచ్చిన అంబటిని, వాదనలు విన్న అనంతరం తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. నవంబర్ 12న వైద్య కళాశాలల విధానాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ర్యాలీలో పోలీసులతో దురుసుగా మాట్లాడటం, బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో ఆయనపై ఈ కేసు నమోదైంది. బీఎన్ఎస్ 132, 351-3, 126-2, 189-2 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lok Sabha: గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా
విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ
Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

