Kriti Sanon: ‘టాలెంట్ ఉన్నవారికి చోటు ఇవ్వండి’.. ఇండస్ట్రీలో బంధుప్రీతిపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది కృతి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ బ్యూటీకి ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్‎గా ఎదగడానికి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతి. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతీ (నెపోటిజం) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Kriti Sanon: 'టాలెంట్ ఉన్నవారికి చోటు ఇవ్వండి’.. ఇండస్ట్రీలో బంధుప్రీతిపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్..
Kriti Sanon
Follow us

|

Updated on: Nov 15, 2023 | 3:28 PM

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టింది కృతి సనన్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో ముందుగా తెలుగు తెరకే పరిచయమైంది. కానీ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‏కు మాకాం మార్చేసింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది కృతి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ బ్యూటీకి ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్‎గా ఎదగడానికి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతి. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతీ (నెపోటిజం) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

వోగ్ ఇండియాతో మాట్లాడిన కృతి సనన్ పరిశ్రమలో బయటి వ్యక్తులకు సమాన అవకాశాలు ఉండాలని అన్నారు. ” బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్, ప్రొడ్యూసర్స్ వారసులు తెరంగేట్రం చేస్తే వాళ్లకు వెంటనే ఎక్కువగా అవకాశాలు వస్తాయి. కానీ ఎప్పుడు సొంతవారికే కాకుండా.. బయటి వ్యక్తులకు.. ప్రతిభ ఉన్నవారికి కూడా ఇండస్ట్రీలో చోటు కల్పించాలి. అందరికీ సమాన అవకాశాలను ఇవ్వడం ప్రారంభిస్తే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇండస్ట్రీ బయటి వ్యక్తులకు అందుబాటులోకి వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. పెద్ద స్టార్స్ కంటే ప్రపంచం ఇప్పుడు ప్రతిభ ఉన్నవారి వైపు , కొత్త స్క్రిప్ట్‌ల వైపు మొగ్గు చూపుతోంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

అయితే నెపోటిజం గురించి కృతి మాట్లాడడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ దీనిపై చాలాసార్లు స్పందించారు. తన కెరీర్ ఆరంభంలో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని అని.. తనకు వచ్చిన పాత్రలలో స్టార్ కిడ్స్ కనిపించారని అన్నారు. కృతి సనన్ చివరిగా టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘గణపత్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె కరీనా కపూర్, టబుతో కలిసి రాజేష్ కృష్ణన్ తెరకెక్కిస్తోన్న కామెడీ-డ్రామా ‘ది క్రూ’లో నటించనుంది. అలాగే తరుణ్ మన్సుఖాని ‘హౌస్‌ఫుల్ 5’లో కూడా కృతి కనిపించనుంది.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.