AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరె ఏంట్రా ఇది.. రూ.300 కోట్లు వసూలు చేసిన హీరోయిన్.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే తెలుగులోకి అడుగుపెడుతుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడు నటించిన తెలుగు సినిమా రూ.300 కోట్లు రాబట్టింది. అయినా బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు..

Tollywood: అరె ఏంట్రా ఇది.. రూ.300 కోట్లు వసూలు చేసిన హీరోయిన్.. అయినా పట్టించుకోని టాలీవుడ్..
Aishwarya Rajesh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2025 | 7:55 AM

అచ్చ తెలుగమ్మాయి.. కానీ తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్ తోనే ఎదిగింది. కలర్ తక్కువ ఉండడంతో కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స అందుకుంది. ఇటీవలే తెలుగులో ఆమె నటించిన సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ ఈ అమ్మడుకు మాత్రం ఆఫర్స్ రావడం లేదు. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో మిస్ మ్యాచ్ చిత్రంలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ విజయ్ దేవరకొండ జోడిగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో గృహిణి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత టక్ జగదీష్, రిపబ్లి్క్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో ఐశ్వర్యకు అంతగా క్రేజ్ రాలేదు. దీంతో తిరిగి తమిళం, మలయాళం భాషలలోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి :  Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేశ్. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యా్ప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. వెంకటేశ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలించింది. ఈ చిత్రంలో భాగ్యం పాత్రలో అదరగొట్టింది ఐశ్వర్య. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో ఐశ్వర్యకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఒక్క తెలుగు సినిమా సైతం లేకపోవడం గమనార్హం. దీంతో ఈ బ్యూటీని టాలీవుడ్ అంతగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..