Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున.. మూడో పవరాస్త్ర దక్కింది ఎవరికంటే?

సాధారణంగా బిగ్‌బాస్‌ వీకెండ్‌ చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. కంటెస్టెంట్లపై హోస్ట్‌ నాగార్జున పంచులు, సెటైర్లు వేస్తూ కవ్విస్తూ ఉంటారు. అయితే ఈ వీకెండ్‌ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా సాగింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్లపై పంచులు, సెటైర్లు వేసిన నాగ్‌.. సేఫ్‌ గేమ్‌ ఆడేవారిపై మాత్రం ఫైరయ్యారు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌గా పేరున్న అమర్‌దీప్‌కు బాగా ఇచ్చి పడేశారు. అసలు గేమ్‌ ఎవరికోసం ఆడుతున్నావ్‌? అంటూ మండిపడ్డారు.

Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున.. మూడో పవరాస్త్ర దక్కింది ఎవరికంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2023 | 8:47 PM

సాధారణంగా బిగ్‌బాస్‌ వీకెండ్‌ చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. కంటెస్టెంట్లపై హోస్ట్‌ నాగార్జున పంచులు, సెటైర్లు వేస్తూ కవ్విస్తూ ఉంటారు. అయితే ఈ వీకెండ్‌ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా సాగింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్లపై పంచులు, సెటైర్లు వేసిన నాగ్‌.. సేఫ్‌ గేమ్‌ ఆడేవారిపై మాత్రం ఫైరయ్యారు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌గా పేరున్న అమర్‌దీప్‌కు బాగా ఇచ్చి పడేశారు. అసలు గేమ్‌ ఎవరికోసం ఆడుతున్నావ్‌? అంటూ మండిపడ్డారు. అలాగే రైతు బిడ్డను క్లాస్‌ తీసుకున్నారు? నువ్వు కూడా గేమ్‌ ఆడొచ్చుగా తనదైన శైలిలో పంచులు వేశారు. హౌస్‌లో సేఫ్ గేమర్‌ ఎవరు? గేమ్ ఛేంజర్ ఎవరు? అని కంటెస్టెంట్లందరినీ అడిగారు నాగార్జున. పల్లవి ప్రశాంత్‌ ఎవరినో చూపించి గేమ్‌ ఛేంజర్‌ బ్యాడ్జి పెట్టగా.. ‘నువ్వు కూడా తనను చూసి నేర్చుకోవచ్చుగా ప్రశాంత్‌’ అంటూ కౌంటర్‌ వేశారు. దీనికి ‘సార్‌.. నేను నేర్చుకున్నా’ అని రైతు బిడ్డ రిప్లై ఇస్తే.. ‘ఏంది.. హౌజ్‌లో ఏడవటమా? అని మళ్లీ కౌంటర్‌ వేశారు నాగ్. ఇక గౌతమ్‌ టేస్టీ తేజాను సేఫ్ ప్లేయర్‌ అనే ట్యాగ్ ఇచ్చాడు. హౌజ్‌లో తేజ పార్టిసిపేషన్‌ లేదని, ఫిజికల్‌ టాస్కులంటేనే భయపడుతున్నాడని కారణాలు చెప్పాడు గౌతమ్‌. దీనిని సమర్థిస్తూ తేజాకు కూడా గట్టిగానే ఇచ్చిపడేశారు నాగ్.

ఇక సింగర్‌ దామిని అమర్‌దీప్‌ను సేఫ్‌ ప్లేయర్‌గా అభివర్ణించింది. దీంతో మరోసారి అమర్‌దీప్‌ను వాయించారు నాగ్. ‘నేను విలన్ అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టావ్ కదా అమర్.. విలన్ అవుదామని తీసుకున్నావా లేక శివాజీని హీరో చేద్దామని తీసుకున్నావా? అని నాగ్ ప్రశ్నలు వేశారు. ‘నేను విలన్‌ అవుదామనే తీసుకున్నా సార్‌’ అని అమర్ అన్సరివ్వగా.. మరి ఫైనల్‌గా ఏమయ్యావ్‌? ఏదో అంటే ఏదో జరిగింది చివరికి’ అని అమర్‌ను క్లాస్‌ పీకారు నాగ్. ఆ తర్వాత మూడవ హౌస్‌మెట్‌ను ప్రకటించే సమయం ఆసన్నమైందంటూ టెన్షన్‌ పెట్టారు. కాగా ఈ వారం ప్రియాంక జైన్‌, శోభాశెట్టిలలో ఒకరు థర్డ్‌ హౌజ్‌మేట్‌ కానున్నారు. ఇందుకోసం నిన్న జరిగిన ఎలక్ట్రిక్‌ బుల్‌ రైడ్‌ టాస్క్‌లో శోభాశెట్టే ఎక్కువ సేపు ఆడినట్లు కనిపించింది. సో.. కార్తీక దీపం విలనే మూడో హౌజ్‌మేట్‌ అని ఆడియెన్స్‌ గెస్‌ చేస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందా? కాదా? అన్నది చూడాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూశారా?

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.