AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్.. వెంటబడిన సుపారీ గ్యాంగ్.. కట్ చేస్తే షాకిచ్చిన భార్య!

ఈ మధ్యకాలంలో జరుగుతోన్న ప్రతీ క్రైమ్ కథలోనూ వివాహేతర సంబంధమే మెయిన్ పాయింట్‌గా నిలుస్తోంది. వివాహేతర సంబంధాలు...

Crime: భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్.. వెంటబడిన సుపారీ గ్యాంగ్.. కట్ చేస్తే షాకిచ్చిన భార్య!
Crime
Ravi Kiran
|

Updated on: Mar 21, 2022 | 3:21 PM

Share

ఈ మధ్యకాలంలో జరుగుతోన్న ప్రతీ క్రైమ్ కథలోనూ వివాహేతర సంబంధమే మెయిన్ పాయింట్‌గా నిలుస్తోంది. వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజా తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు ఓ భార్య కుట్ర పన్నగా.. ఆ పన్నాగాన్ని పోలీసులు బట్టబయలు చేసి నిందితులను కటకటాలు పాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

భాస్కర్, హరిత ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. కొద్దిరోజులు వీరి బంధం సజావుగానే సాగింది. అయితే అదే కాలనీలో ఉండే వెంకటేష్‌తో హరిత వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి కాపురంలో కలతలు ఏర్పడ్డాయి. భాస్కర్, హరితల మధ్య రోజూ గొడవలు జరగడం ప్రారంభించాయి. దీనితో విసిగిపోయిన భాస్కర్ తమ మకాన్ని మన్సూరాబాద్ నుంచి మార్చేశాడు. దీనితో హరిత, వెంకటేష్‌ల మధ్య దూరం పెరిగింది.

తమ వివాహేతర సంబంధానికి భర్త భాస్కర్ అడ్డొస్తున్నాడని.. అతడ్ని ఎలాగైనా హత్య చేయించాలని హరిత, వెంకటేష్‌లు కుట్ర పన్నుతారు. ఈ క్రమంలోనే నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నవీన్‌కు భాస్కర్‌ను చంపమని చెప్పి వెంకటేష్ సుపారీ ఇచ్చాడు. అలాగే భాస్కర్ కదలికలను తెలుసుకునేందుకు అతడి కారుకు భార్య హరిత జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. జీపీఎస్‌ను ట్రాక్ చేసిన సుపారీ గ్యాంగ్.. భాస్కర్‌ను ఈ రోజు హత్య చేసేందుకు స్కెచ్ వేయగా.. పోలీసులు ముందే కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్ట్ చేశారు.