AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: షుగర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. రూ.కోటి పరిహారానికి డిమాండ్

కాకినాడ (Kakinada) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామీణం మండలంలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్యారీ షుగర్స్‌ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 9..

Andhra Pradesh: షుగర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. రూ.కోటి పరిహారానికి డిమాండ్
Fire (file)
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Aug 20, 2022 | 3:57 PM

Share

కాకినాడ (Kakinada) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామీణం మండలంలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్యారీ షుగర్స్‌ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడ్ చేస్తున్న సమయంలో కన్వేయర్‌ బెల్టుకు విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను వీరవెంకట సత్యనారాయణ, వీరమళ్ల రాజేశ్వరరావుగా గుర్తించారు. గాయపడిన వారిలో బండి వీరవెంకట రమణ పరిస్థితి విషమంగా ఉంది. వైద్య చికిత్స కోసం అతడిని కాకినాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మంది కాకినాడలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యంతో చర్చలు జరిపే ఏర్పాటు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో. కార్మికులు, ప్రజాసంఘాలు శాంతించారు.

ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం

ఇవి కూడా చదవండి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..