AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nityananda: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులు

నిత్యానందకు (Nityananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి ఈ వారెంట్ ఇచ్చారు. బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు...

Nityananda: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులు
Nityananda
Ganesh Mudavath
|

Updated on: Aug 20, 2022 | 7:12 AM

Share

నిత్యానందకు (Nityananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి ఈ వారెంట్ ఇచ్చారు. బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే వారెంట్ జారీ చేశారు. అయితే ఆయన ఆచూకీని మాత్రం పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని కోర్టు విచారించింది. నిత్యానంద హాజరు కాకపోవడంతో విచారణ నిలిచిపోయింది. ఈ క్రమంలో కేసు విచారణకు హాజరు కావాలంటూ 2019 నుంచి సమన్లు ఇస్తూనే ఉంది. తాజాగా ఇచ్చిన వారెంట్ ప్రకారం సెప్టెంబర్‌ 23 లోగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఫిర్యాదు ఆధారంగా ఆతనిపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన నిత్యానంద తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తర్వాత అతను దేశం నుంచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

కాగా.. దేశం నుంచి పారిపోయిన నిత్యానంద ‘కైలాస’ అనే స్వతంత్ర దేశాన్ని స్థాపించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కైలాస అనే ప్రదేశం ఎక్కడ ఉందన్న దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్వెడార్‌ సమీపంలో తాను ఓ చిన్న చిన్న దీవిని కొనుగోలు చేశానని, దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్‌ ఖండించింది. నిత్యానంద తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం నిత్యానంద చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నిత్యానంద.. తాను బతికే ఉన్నానని డాక్టర్లు చికిత్స చేస్తున్నారని వెల్లడించాడు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?