AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: తలుపు కొట్టారు.. రూ.లక్షలు దోచుకెళ్లారు.. పట్టపగలు దోపిడి దొంగల బీభత్సం..

పంచశీల్ నగర్‌కు చెందిన ప్రొఫెసర్ శిశిర్ తివారీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కుటుంబాన్ని బందీలుగా ఉంచారని తెలిపారు.

Robbery: తలుపు కొట్టారు.. రూ.లక్షలు దోచుకెళ్లారు.. పట్టపగలు దోపిడి దొంగల బీభత్సం..
Gwalior Robbery
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2022 | 8:32 AM

Share

Gwalior Robbery: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు ముసుగు దొంగలు ప్రొఫెసర్ కుటుంబాన్ని బంధించి తుపాకీతో బెదిరించారు. అనంతరం లక్షల రూపాయలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గోలక మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల్ నగర్‌లో చోటుచేసుకుంది. దోపిడీ జరిగిన సమయంలో ప్రొఫెసర్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. పంచశీల్ నగర్‌కు చెందిన ప్రొఫెసర్ శిశిర్ తివారీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కుటుంబాన్ని బందీలుగా ఉంచారని తెలిపారు. తుపాకీతో బెదిరించి లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులను దోచుకున్నారని తెలిపారు. మొదట దొంగలు ప్రొఫెసర్ ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసిన శ్వేతా దీక్షిత్‌కు తమని ప్రొఫెసర్‌ పంపారని చెప్పడంతో వారిని లోనికి అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలో ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై ఇంటికి వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే దోపిడీకి పాల్పడిన ముగ్గురిని వదిలి.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు పారిపోయారు.

వారు లోపలికి వచ్చిన వెంటనే, వారు శ్వేతపై తుపాకీని గురిపెట్టి, ఆమె అత్త, కుమార్తెతో సహా ఇతర కుటుంబ సభ్యులందరినీ బందీలుగా చేసుకున్నారు. రూ.60 వేల నగదు, లక్షల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు దాదాపు 20 నిమిషాల పాటు ఇంట్లోనే ఉండి విలువైన వస్తువులను సేకరించి పరారయ్యారని శ్వేత తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనాస్థలిని పరిశీలించిందని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..