AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజాపూర్‌‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. భీకర కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల హతం, భారీగా ఆయుధాలు స్వాధీనం..!

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ కలకలం రేపింది.. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్ ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంద్రావతి నది తీరప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 26) మావోయిస్టుల ఉనికి గురించి భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి భద్రతా దళాలు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించాయి.

బీజాపూర్‌‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. భీకర కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల హతం, భారీగా ఆయుధాలు స్వాధీనం..!
Encounter In Chhattisgarh
Balaraju Goud
|

Updated on: Feb 26, 2026 | 12:36 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ కలకలం రేపింది.. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్ ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంద్రావతి నది తీరప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 26) మావోయిస్టుల ఉనికి గురించి భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి భద్రతా దళాలు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించాయి. ఇంద్రావతి నది వెంబడి ఉన్న దట్టమైన అడవులలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తీవ్రమైన కాల్పుల తర్వాత, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

తీవ్రమైన కాల్పుల తర్వాత ఘటనాస్థలం నుంచి యూనిఫాంలో ఉన్న ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత, భద్రతా దళాలు సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దీంతో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఘటనాస్థలంలో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, 12-బోర్ రైఫిల్స్ వంటి ప్రాణాంతక ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, ఇతర నక్సలైట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పట్టలింగం మాట్లాడుతూ, ప్రస్తుతం మొత్తం ప్రాంతంలో అక్కడ దాక్కున్న ఇతర మావోయిస్టుల కోసం వెతకడానికి తీవ్ర సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు.

గురువారం ఉదయం ఇంద్రావతి నది వెంబడి ఉన్న అడవిలో కాల్పుల శబ్దాలు వినిపించాయని, దీంతో ఉమ్మడి భద్రతాదళ బృందం రంగంలోకి దిగిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకోవడం మావోయిస్టులు పెద్ద దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు సూచించిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేటి చర్యతో, 2026 లోనే ఇప్పటివరకు వివిధ ఎన్‌కౌంటర్లలో సుమారు 25 మంది మావోయిస్టులు మరణించారు. గతంలో, జనవరి 3న బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించారు. గత ఏడాది, ఛత్తీస్‌గఢ్‌లో వివిధ ఆపరేషన్లలో మొత్తం 285 మంది మావోయిస్టులు మరణించారు, ఇది రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక ప్రచారం తీవ్రతను ప్రతిబింబిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us