Road Mishap: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన కారు.. ఇద్దరు స్పాడ్ డెడ్..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద విజయవాడ-చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద..

Road Mishap: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన కారు.. ఇద్దరు స్పాడ్ డెడ్..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 8:52 AM

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద విజయవాడ-చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. క్షతగాత్రులను రక్షించి పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాకు బొంగుపేలాల వ్యాపారం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. సొంతపనుల కోసమా..? పీసీసీ కోసమా..?

ఖైదీల‌ను వ‌ద‌ల‌ని కోవిడ్‌.. జైల్లో 112 మంది ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో జైలు అధికారులు