AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:కోఠి ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

వైద్యం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

Hyderabad:కోఠి ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
Koti Hospital
Balaraju Goud
|

Updated on: Sep 27, 2021 | 4:52 PM

Share

Hyderabad Woman died: వైద్యం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణీ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన పూజ నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం కోఠిలోని ప్రభుత్వం మెటర్నిటీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఆరోగ్యంగా ఉన్న పూజకు సోమవారం ఉదయం కాన్పు కోసం వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే, పూజకు సిజేరిన్ ఆపరేషన్ చేస్తుండగా శిశువుకు జన్మనిచ్చి మృతి చెందింది. ఇదే విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన పూజ బంధువులు వైద్యులు సక్రమంగా ఆపరేషన్ చేయకపోవడంతో పూజ మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోఠి ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.కాగా, ఘటన పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, శిశువు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read Also… Viral Video: భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై