AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“వర్క్‌ ఫ్రం హోమ్..” ఇకపై పర్మినెంట్‌ చేయనున్నారా..? కేంద్రం ఏం ఆలోచిస్తోంది..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక దేశాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఉద్యోగులు చేసే పని తీరులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది ఉద్యోగులకు అనేక దేశాల్లో వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి. ఇక మనదేశంలో కూడా దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. డిజిటల్ టెక్నాలజీతో పనిచేసే కంపెనీలు.. ఎంప్లాయిస్‌కు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చి పనిచేయిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇలా పనులు కొనసాగుతుండటాన్ని […]

వర్క్‌ ఫ్రం హోమ్.. ఇకపై పర్మినెంట్‌ చేయనున్నారా..? కేంద్రం ఏం ఆలోచిస్తోంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 10:22 PM

Share

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక దేశాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఉద్యోగులు చేసే పని తీరులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది ఉద్యోగులకు అనేక దేశాల్లో వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి. ఇక మనదేశంలో కూడా దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. డిజిటల్ టెక్నాలజీతో పనిచేసే కంపెనీలు.. ఎంప్లాయిస్‌కు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చి పనిచేయిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇలా పనులు కొనసాగుతుండటాన్ని ఎక్స్‌పర్ట్స్‌ పరిశీలిస్తున్నారు. ఇక కరోనా నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇలా వర్క్ ఫ్రం హోంను ఉద్యోగులకు పర్మినెంట్ చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిని గ్రహిస్తోంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి పనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో వర్క్‌ చేసే ఎంప్లాయిస్‌ బెనిఫిట్స్‌ను కాపాడటమే కాకుండా.. పని గంటలు, పని వాతావరణం, శాలరీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించనుంది. ఒకవేళ వర్క్‌ ఫ్రం విధానం ఇంప్టిమెంట్ చేస్తే.. ప్రత్యేక గైడ్‌లైన్స్ అవసరమని ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఓ సీనియర్ అధికారి ఓ జాతీయ మీడియాకు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టంలో.. “వర్క్‌ ఫ్రం హోం”కు నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. కేవలం లాక్‌డౌన్‌ నేపథ్యంలో పీఎం మోదీ.. దేశంలోని కంపెనీలను.. పనిచేసే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతివ్వండి అంటూ కోరారు.