AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: ఆ మహిళకు వరుసగా 19 సార్లు కరోనా పాజిటివ్..

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాగా.. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది.

షాకింగ్: ఆ మహిళకు వరుసగా 19 సార్లు కరోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 11:03 PM

Share

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాగా.. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన మహిళకు ఏకంగా 42 రోజులపాటు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. 62 ఏళ్ల ఈ మహిళకు 19 సార్లు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మార్చి నెలలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇటలీ నుంచి తిరిగి వచ్చారు. కేరళలోని పత్తినంతిట్టకు చెందిన 62 ఏళ్ల మహిళకు 19 సార్లు కరోనా వైరస్ పరీక్షలు చేయగా వరుసగా 19 సార్లు పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళ మార్చి నెల 10వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ