కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ
కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు
కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్డే పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్వీ అశోకన్ ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై జరుగుతున్నా దాడులకు నిరసనగా.. ఆ రోజు దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
[svt-event date=”21/04/2020,2:45PM” class=”svt-cd-green” ]
#IMA demands Special Central Law Against Violence on Doctor’s & Declares White Alert to the nation on 22.04.2020 & Black Day on 23.04.2020. pic.twitter.com/inFOSiJusI
— Indian Medical Association (@IMAIndiaOrg) April 20, 2020
[/svt-event]