AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా కారణంగా మరో నటుడు కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ చిన్నా, పెద్దా అనే ఏ తేడా లేకుండా అందరినీ కమ్మేస్తుంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే..

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2020 | 1:59 PM

Share

కరోనా కారణంగా మరో నటుడు కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ చిన్నా, పెద్దా అనే ఏ తేడా లేకుండా అందరినీ కమ్మేస్తుంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 42 వేల మందికి పైగా మరణించగా.. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్‌లో కూడా కొందరు హీరో, హీరోయిన్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. ఇది చాలదన్నట్లు ఓ హీరోయిన్ తండ్రి ఈ మధ్యే కరోనా సోకి చనిపోయారు.

అలాగే ఇటీవల హాలీవుడ్‌లో మార్క్‌బ్లమ్ అనే నటుడుతో పాటు ప్రముఖ అమెరికన్ సింగర్ జోయో డిస్ఫీ కరోనా పాజిటివ్ కారణంగా కన్నుమూశారు. అలాగే మరో సింగర్ కనికా కపూర్ కూడా కరోనా చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ వైరస్ కారణంగా స్టార్ వార్ ఫేమ్ ఆండ్రూ జాక్ రెండు రోజుల క్రితం కన్నుమూశారు. అయితే కరోనా కారణంగా ఆయన చనిపోయినట్టు ఆయన భార్య గాబ్రియేల్ రోజర్స్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య