లాక్డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకపోవడమేమో కానీ.. కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఉద్యోగులు, రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఉండలేక.. తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో దాదాపు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఈ చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకపోవడమేమో కానీ.. కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఉద్యోగులు, రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఉండలేక.. తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు నోరు లేని జీవాలు పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. వాటిని పట్టించుకునే నాథుడు లేక ఆకలితో అలమటించి మృత్యువాత పడుతున్నాయి.
ఈ క్రమంలో వాటిని ఆదుకోవడానికి ఒడిశా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేటాయించారు. కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చనుంది. వాటికి కడుపునిండా ఆహారం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని.. ఒడిశా సీఎం తెలిపారు. జంతువులకు ఆహారం అందించేలాగా ఈ నిధులను ప్రాంతాలవారీగా కేటాయించనున్నారు. ముందుగా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ మున్సిపాల్ కార్పొరేషన్కు ప్రతీ రోజూ రూ.20 వేలను అందించనున్నారు. అలాగే కటక్, బెర్హం పూర్, రూర్కెలా, సంబల్ పూర్ వంటి మేజర్ పట్టణాలకు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఇక మిగిలిన మున్సిపాలిటీలన్నింటికీ రూ.5000 చొప్పున నిధులు కేటాయించనున్నామని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: వైన్స్ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్
క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
భారత్లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య
సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..