ఈ నెల 16న(శనివారం) కుజుడు కుంభరాశిలో ప్రవేశించాడు. ఇంతవరకూ మకర రాశిలో, తన ఉచ్ఛ స్థానంలో సంచారం చేస్తున్న కుజ గ్రహం ఇక ఏప్రిల్ 23 వరకూ తన శత్రు క్షేత్రమైన కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో సంచారం చేయడమే కాకుండా, తన ప్రబల శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉండాల్సి వస్తుంది. అయితే, బలానికి, శక్తికి, దూకుడుకు, అధికారానికి కారకుడైన కుజుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి యోగాన్నివ్వడం జరుగుతుంది.