Watch: ఎలక్ట్రికల్ సామాన్లు బుక్ చేస్తే.. పార్శిల్లో డెడ్బాడీ వచ్చింది.!
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ కలకలం సృష్టించింది. సాధారణంగా పార్సిల్లో ఏమైనా వస్తువులు వస్తాయి కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యండగండిలో మాత్రం ఓ పార్శిల్లో మృతదేహం వచ్చింది. ఇది చూసిన వారు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యండగండిలో పార్శిల్గా ఓ వ్యక్తి డెడ్ బాడీ వచ్చింది. జగనన్న కాలనీలో ఇంటిని నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళకు ఈ పార్సిల్ వచ్చింది.
ఇంటి సామగ్రితో పాటు పార్శిల్గా ఓ వ్యక్తి డెడ్బాడీ రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్సిల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లు సమాచారం. సాగి తులసి నిర్మిస్తున్న ఇంటికి సామగ్రిని రాజమండ్రి క్షత్రియ పరిషత్ నిర్వాహకులు సరఫరా చేస్తుంటారు. ఆ మహిళకు ఇంటి సామాన్లను ఓ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని ఫోన్ చేసి తెలిపాడు.
సదరు మహిళ ఆ సామాన్లను తీసుకుంది. ఈరోజు ఉదయం ఆ వస్తువులను తెరవగానే ఒక్కసారిగా షాక్కు గురి అయింది. ఆ పార్సిల్లో వ్యక్తి మృతదేహం చూసి భయపడిపోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ పార్సిల్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది. పార్సిల్ తెచ్చిన సదరు వ్యక్తి కదలికలపై సైతం పోలీసులు నిఘా పెట్టారు. ఆవ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ పార్సిల్పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

