AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు….

ఊరు మంచి కోరేవాడు. ఊరి బాగోగులు చూసేవాడు. ఊళ్లో వారికి ఆదర్శంగా నిలవాలి. కాని ఆయన అలా చేయలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల మధ్య ప్రజలు...

Telangana News: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు....
Sarpanch Corona
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2021 | 11:45 AM

Share

ఊరు మంచి కోరేవాడు. ఊరి బాగోగులు చూసేవాడు. ఊళ్లో వారికి ఆదర్శంగా నిలవాలి. కాని ఆయన అలా చేయలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల మధ్య ప్రజలు, అధికారులు ప్రాణభయంతో జీవిస్తూ ఉంటే …వైరస్‌ సోకిందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.  ఈ ఘనకార్యం వెలగబెట్టింది ఎవరో తెలుసా !. మంచిర్యాల జిల్లా వెల‌మ‌ప‌ల్లి గ్రామ సర్పంచ్  గోనె సత్యనారాయణ. ఈనెల 3న సత్యనారాయణకి కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్లు మందులు వాడుతూ ఇంట్లో ఉండమని సూచించారు. అయితే ఆయనగారు మాత్రం…గ్రామంలో ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమం, గ్రామ స‌భ ఉండటంతో కరోనాతో చికిత్స పొందుతూనే సమావేశాల్లో పాల్గొనడంతో అంతా ఆశ్చర్యపోయారు. వెల‌మ‌ప‌ల్లి మ‌హారాష్ట్రకు సమీపంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ కరోనా యాక్టివ్ కేసులు 30కిపైగా ఉన్నాయి.

ఇక సర్పంచ్‌ తీరుతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవడంతో …పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. గ్రామంలో పర్యటించి కరోనా సోకిన వాళ్లు వ్యాధి నయమయ్యేవరకు బయట తిరగవద్దన్నారు. అయితే పల్లెప్రగతి కన్సల్టెంట్ అధికారి, కోటపల్లి మండల పంచాయితీ అధికారి సూచనల మేరకే సర్పంచ్ గ్రామసభకు హాజరైనట్లుగా తెలుస్తోంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అప్రమ‌త్తమైన ప్రభుత్వం ఒక వైపు స‌మీక్షలు నిర్వహిస్తూ నివార‌ణ చ‌ర్యలు చేపడుతుంటే …గ్రామ ప్రథమ పౌరుడే ఇలా నిర్లక్ష్యంగా వ్యవ‌హిరించ‌డం ఎంత వరకు కరెక్ట్ అనే విమర్శిస్తున్నారు గ్రామస్తులు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ గా తేలినా..  సింటమ్స్ ఉన్నా క్వారంటైన్ లో ఉండాలి. జనసమూహానికే కాదు ఇంట్లోనూ అందరికీ దూరంగా కనీసం 14 రోజులు ఉండాలి. అప్పుడు కూడా వ్యాధి నయం అయిందని నిర్ధారణ అయితేనే సాధారణ జీవనం గడపాలి.

Also Read:  పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

గేదె శిశువులో బవిన్ వైరస్ ..! జంతువుల నుంచి మానవులకు వచ్చే అవకాశం..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..