AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: కాస్త ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈక్రమంలో కేసుల నుంచి కొంచెం ఉపశమనం

India Coronavirus: కాస్త ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..
India Corona Updates
TV9 Telugu Digital Desk
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 11, 2021 | 10:03 AM

Share

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈక్రమంలో కేసుల నుంచి కొంచెం ఉపశమనం లభించిన్పటికీ పెరుగుతున్న కరోనా మరణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే.. శనివారం కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కాగా.. దేశవ్యాప్తంగా నిన్న (శనివారం) కొత్తగా 41,506 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 895 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. యాక్టివ్ కేసుల రేటు 1.47 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం ఉంది. తాజాగా నమోదైన మరణాలతో.. మృతుల సంఖ్య 4,08,040 కి పెరిగింది. కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది.

ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 41,526 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,99,75,064 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,54,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 37,60,32,586 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా.. దేశంలో నిన్న 18,43,500 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్నటి వరకు మొత్తం 43,08,85,470 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Also Read:

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..