AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య

దేశంలో న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు.

Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య
Omicron
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2021 | 12:28 PM

Share

దేశంలో న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. ముఖ్యంగా మహారాష్ట్ర ఒమిక్రాన్‌కు సెంటర్‌గా మారింది. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో.. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ విజృంభణతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేస్తోంది. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు.

ఇక 60 ఏళ్ల వయసువారికి జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోస్‌ వేయనున్నారు. ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ప్రికాషన్‌ డోస్‌ వేయనున్నట్టు ప్రకటించారు ప్రధాని. ఇక త్వరలోనే నాజిల్‌, డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని..ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో.. డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు ప్రధాని మోదీ.

మరోవైపు 12 నుంచి 18ఏళ్ల వయసు వారికి భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను ఇచ్చేందుకు DCGI అత్యవసర అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌తో పిల్లల్లోనూ అద్భుత ఫలితాలొస్తున్నాయని..కొత్త వేరియంట్‌లపై కూడా..వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది భారత్‌ బయోటెక్‌.

ఇక ఈ ఏడాది జనవరి 16 నుంచి టీకాల పంపిణీ ప్రారంభించామన్నారు ప్రధాని..ఇప్పటివరకు 141కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్‌ అందించామన్నారు. దేశ జనాభాలో 90శాతం మంది ఫస్ట్‌ డోస్‌ కంప్లీట్‌ అయిందని..ఇక 61శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయన్నారు.

Also Read: బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్