AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: ఏపీలో అన్ని జిల్లాలకు పాకిన వైరస్.. విజయనగరంలో తొలి కరోనా కేసు

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలకు కరోనా వైరస్ పాకింది. ఇప్పటివ‌ర‌కూ ఏపీ వ్యాప్తంగా గ్రీన్ జోన్‌గా ఉన్న విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో అన్ని జిల్లాలకు పాకిన వైరస్.. విజయనగరంలో తొలి కరోనా కేసు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2020 | 4:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలకు కరోనా వైరస్ పాకింది. ఇప్పటివ‌ర‌కూ ఏపీ వ్యాప్తంగా గ్రీన్ జోన్‌గా ఉన్న విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కిడ్నీ ప్రాబ్లెమ్‌తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్లిన ఆమెకు అక్కడ పరీక్ష చేయగా కరోనా సోకిన‌ట్టు తేలింది. ఆమె కొడుకులు ద్వారా ఆమెకి కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

అలాగే ఆమె కుటుంబ సభ్యులందరనీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తీసుకొచ్చి కరోనా టెస్టులు చేస్తున్నట్లు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఎస్.వి. రమణ కుమారి తెలిపారు. విజయనగరం జిల్లాలో వీళ్లు అన్ని చోట్లా తిరిగినట్లు సమాచారం. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాగే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1777 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 36 మంది మరణించారు. అలాగే 589 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జి కాగా.. 1097 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్

మీరు సరిగ్గా నిద్రపోవటం లేదా? అయితే కరోనా దాడిని తట్టుకోలేం!