AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Transit 2026: కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది.. 2026లో వీరికి పట్టిందల్లా బంగారమే!

2026లో రాహువు రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ అరుదైన గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సామాజిక గౌరవం పెరుగుతుంది. రాహువు అనుగ్రహం ఉంటే సామాన్యులు కూడా కోటీశ్వరులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2026లో రాహువు అడుగు పెట్టబోయే కొత్త రాశులు ఏవి? ఏ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది? పూర్తి వివరాలు మీకోసం.

Rahu Transit 2026: కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది.. 2026లో వీరికి పట్టిందల్లా బంగారమే!
Rahu Transit 2026
Bhavani
|

Updated on: Dec 21, 2025 | 6:31 PM

Share

వచ్చే ఏడాది జ్యోతిష్య పరంగా అత్యంత కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రాహు గ్రహం 2026లో రెండుసార్లు తన గమనాన్ని మార్చుకోనుంది. ఆగస్టు 2న అవిట్ట నక్షత్రంలోకి, ఆపై డిసెంబర్‌లో మకర రాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు. ఈ ద్వంద్వ సంచార ప్రభావం వల్ల మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి.

మిథునం: వ్యాపారంలో దూకుడు

మిథున రాశి వారికి 2026 ఏడాది వరప్రసాదంగా మారనుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. విదేశీ యానం, సాంకేతిక రంగాల్లో ఉండేవారికి భారీ లాభాలు చేకూరతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం: శత్రువులపై విజయం

సింహ రాశి వారికి రాహువు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయాల్లో ఉండేవారికి పదవీ యోగం కనిపిస్తోంది. మీ ఆత్మవిశ్వాసం ముందు శత్రువులు తలవంచుతారు. ఆర్థికంగా స్థిరపడటానికి అనేక అవకాశాలు వస్తాయి.

తుల: ఆరోగ్యమే మహాభాగ్యం

తుల రాశి వారికి పాత అప్పుల బాధలు తొలిగిపోతాయి. గతంలో వేధించిన అనారోగ్య సమస్యలు నయమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తారు. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది.

ధనుస్సు: ఆదాయ మార్గాలు పెరుగుతాయి

ధనుస్సు రాశి వారిలో పట్టుదల పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. సంవత్సరం మధ్యలో వచ్చే చిన్నపాటి ఆటంకాలను సులభంగా అధిగమిస్తారు. చిక్కుల్లో ఉన్న ఆస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి.

కుంభం: లక్ష్యాల సాధన

కుంభ రాశి వారికి వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభాలు మెండుగా ఉన్నాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. కార్యాలయాల్లో అధికారుల ప్రశంసలు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు.

విజయం కోసం సూచనలు:

ప్రతిరోజూ ‘రాహు గాయత్రి మంత్రాన్ని’ జపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.

గందరగోళానికి గురికాకుండా నిర్ణయాలు తీసుకోవడం మేలు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది.