పొరుగు దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు..
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్పై ఏడు లక్షలకు పైగా నమోదయ్యాయి. వీరిలో రెండున్నర లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పన్నెండు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి మన భారతదేశాన్ని కూడా గజగజ వణికిస్తోంది. ఇప్పటికే బుధవారం నాటికి యాభై వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక […]
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్పై ఏడు లక్షలకు పైగా నమోదయ్యాయి. వీరిలో రెండున్నర లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పన్నెండు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి మన భారతదేశాన్ని కూడా గజగజ వణికిస్తోంది. ఇప్పటికే బుధవారం నాటికి యాభై వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మన పొరుగు దేశాల్లో కూడా ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే బంగ్లాదేశ్ వ్యాప్తంగా కొత్తగా 790 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఈ కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,719కి చేరింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక బుధవారం నాడు కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని.. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 186కు చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,403కు చేరిందని తెలిపారు.