శ్రీశైలంలో ఏపీ, కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. క్యూ లైన్ పాటించకుండా ఓవర్ టేక్ చేసిన కర్ణాటక బస్సును ఏపీ డ్రైవర్ చాంద్ భాషా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన కర్ణాటక సిబ్బంది, ప్రయాణికులు చాంద్ భాషాను బలవంతంగా వారి బస్సులోకి ఎక్కించుకుని, దోర్నాల వరకు 15 కిలోమీటర్లు కొడుతూ తీసుకెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకుని విచారణ చేపట్టారు. ఏపీ ఆర్టీసీ సిబ్బంది ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.