AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ తెలిపారు.

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Apr 23, 2020 | 1:19 PM

Share

కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ తెలిపారు. దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే వారి జీతాన్ని ఒకేసారి కట్ చేయకుండా నెలకు 6 రోజుల డబ్బులు 5 నెలల పాటు కోత విధించనున్నారు. ఇక రూ. 20 వేల లోపు శాలరీ ఉన్నవారికి, పెన్షనర్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిందని.. అందుకే జీతాల్లో కోత విధించాల్సి వచ్చిందని విజయన్ తెలిపారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధుల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఉద్యోగులందరూ సహకరించాలని ఆయన కోరారు. కరోనా తీవ్రత తగ్గి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కోత విధించిన డబ్బులను తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాగా, 2018లో కేరళలో వరదలు ముంచెత్తినప్పుడు కూడా కేరళ ప్రభుత్వం.. గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతాల్లో కోత విధిస్తామని తెలుపగా.. ఉద్యోగ సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

స్మిత్, వార్నర్ రాకతోనే ఆస్ట్రేలియా సిరీస్ మజా…