తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్లో ఏఎస్ఐ రాములు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పూర్విక కర్రీ పాయింట్ వద్ద చికెన్ కర్రీ కోసం సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయన, అనుచితంగా ప్రవర్తించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో ఉన్నతాధికారులు రాములపై వేటు వేసి సస్పెండ్ చేశారు.