కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Coronavirus Tests In AP: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకుగానూ ఏపీ సర్కార్ 830 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఏపీ తర్వాత రాజస్తాన్ 809 మందికి పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 41,512 పరీక్షలు చేపట్టింది. అంతేకాక నిన్న ఒక్క రోజే 5,757 మందికి టెస్టులు నిర్వహించామని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 813 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read:
కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
జూన్ 1 వరకూ లాక్డౌన్.. సర్కార్ కీలక నిర్ణయం..
కరోనా వేళ.. పాక్కు గట్టి షాక్.. క్వారంటైన్కు ఇమ్రాన్ ఖాన్.!