RRC Secunderabad Results 2023: ఆర్ఆర్సీ సికింద్రాబాద్ గ్రూప్-డి తుది ఫలితాలు విడుదల.. ఎంత మంది ఎంపికయ్యారంటే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) సికింద్రాబాద్ బుధవారం (మార్చి 22) విడుదల చేసింది..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) సికింద్రాబాద్ బుధవారం (మార్చి 22) విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు లెవల్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 12 నుంచి 22 వరకు పీఈటీ (శారీరక సామర్థ్య పరీక్షలు) పరీక్షలు జరిగాయి. వీటిల్లో దాదాపు 9,303 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. వీరికి ఫిబ్రవరిలో ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించించింది.
ఈ మూడు దశల్లో్ ఉత్తీర్ణులైన 7,869 మంది అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్షాప్ తదితర విభాగాల్లో.. అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలెట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్మెన్ తదితర పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ కార్యాలయం ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.