AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కొడుకుకు పెళ్లి చేసి జైలు పాలైన తండ్రి.. ఒకేఒక్క నిర్ణయంతో అడ్డం తిరిగిన కథ..

కొడుకు పెళ్లి చేసేందుకు అప్పులపాలైన తండ్రి అప్పు తీర్చేందుకు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కట్‌చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఊచలు లెక్కబెట్టవల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News: కొడుకుకు పెళ్లి చేసి జైలు పాలైన తండ్రి.. ఒకేఒక్క నిర్ణయంతో అడ్డం తిరిగిన కథ..
MP Crime News
Srilakshmi C
|

Updated on: Mar 22, 2023 | 10:25 AM

Share

కొడుకు పెళ్లి చేసేందుకు అప్పులపాలైన తండ్రి అప్పు తీర్చేందుకు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కట్‌చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఊచలు లెక్కబెట్టవల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతానికి చెందిన రాజేంద్ర పండిట్ ఓ వ్యక్తివద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో రాజేంద్ర తన కొడుకుకు పెళ్లి చేశాడు. ఈ పెళ్లి వల్ల రాజేంద్ర రూ.4 నుంచి 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పు తీర్చేమార్గం దొరకకపోవడంతో ఏకంగా యజమానికే ఎసరు పెట్టాడు. యజమాని బ్యాంకు నుంచి డ్రా చేసి కారులో ఉంచిన రూ.4 లక్షల నగదును కాజేశాడు. ఐతే ఈ మొత్తం దృశ్యాలు కారు సమీపంలోని సీసీటీవీలో నమోదయ్యాయి.

కారులో డబ్బులు మాయమైనట్లు గ్రహించిన యజమాని రాజేంద్రను డబ్బు విషయమై ప్రశ్నించాడు. తనకు తెలియదని రాజేంద్ర బుకాయించాడు. దీంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడు రాజేంద్రగా పోలీసులు గుర్తించారు. దీంతో  రాజేంద్రను అరెస్టు చేసి, చోరీ చేసిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.