AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Aviation Sector: భారత్‌కు 31,000 మంది పైలట్లు కావలెను.. 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టిన ఎయిర్ ఇండియా

దేశంలోని దేశీయ విమానయాన సంస్థలు 1100 విమానాల కోసం ఆర్డర్లు చేశాయి. వాటిని డెలివరీ చేసే ప్రక్రియలో కంపెనీలు ఉన్నాయి. ఈ విమానాలను నడపడానికి పెద్ద ఎత్తున పైలట్లు అవసరం. ఎంత మందో తెలిస్తే మీరు కూడా ఇప్పటి నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టవచ్చు.

Indian Aviation Sector: భారత్‌కు 31,000 మంది పైలట్లు కావలెను.. 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టిన ఎయిర్ ఇండియా
Aircraft Pilots
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2023 | 9:05 AM

Share

భారత విమానయాన మార్కెట్‌లో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. విమానయాన రంగం భారీ ఎత్తున అభివృద్ధిలో దూసుకుపోతోంది. భారతీయుల నుంచి విమాన ప్రయాణాలపై పెరుగుతున్నఆసక్తిని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో ఇప్పటికే కొత్త విమానాలు కొనేందుకు కంపెనీలకు ఆర్డర్లు పెట్టాయి భారతీయ విమానయాన సంస్థలు. ఎయిర్ ఇండియా 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇండిగో కూడా కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విమానాల కోసం పెద్ద సంఖ్యలో పైలట్లు, మెకానిక్‌లు అవసరం. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 31,000 మంది పైలట్లు, 26,000 మంది మెకానిక్‌లు అవసరమని అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ తెలిపింది.

రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించబోతోందని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే తెలిపారు. భారతదేశానికి విమానాలను నడపడానికి 31వేల మంది పైలట్లు, విమానాలను నిర్వహించడానికి 26వేల మంది మెకానిక్‌లు అవసరం. మన దేశం ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరింత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. విమానాశ్రయాల అభివృద్ధితో పైలట్లు, మెకానిక్‌ల అవసరాలు ఇందులో ఉన్నాయి.

ఇటీవల, బోయింగ్ తన నివేదికలో 2040 నాటికి, భారతదేశం ఎయిర్ ట్రాఫిక్ 7 శాతం చొప్పున వార్షిక వృద్ధిని చూపుతుందని పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత విమాన ప్రయాణానికి డిమాండ్ రావడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని సలీల్ గుప్తే తెలిపారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విమాన ప్రయాణ వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు.

విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, దేశంలోని దేశీయ విమానయాన సంస్థలు రాబోయే రోజుల్లో 1100 కంటే ఎక్కువ కొత్త విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి. ఇప్పటికే టాటా సంస్థ అదే పని ఉంది. టాటా గ్రూప్ బోయింగ్,  ఎయిర్‌బస్‌లకు 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. కంపెనీకి అదనంగా మరో 370 విమానాలను ఆర్డర్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎయిర్‌లైన్స్ కంపెనీలు 2210 కొత్త విమానాలను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, అకాసా మొత్తం 1115 విమానాలు ఆర్డర్‌లో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...