AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Schools: సీబీఎస్సీ స్కూళ్లలో ‘షుగర్ బోర్డులు’ ఏర్పాటు చేయాలని హుకూం.. ఎందుకంటే?

సీబీఎస్సీ దాని అనుబంధ పాఠశాల్లో పిల్లల చక్కెర తీసుకోవడం పర్యవేక్షించడానికి, దాని వినియోగాన్ని తగ్గించడానికి షుగర్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్సీ అధికారులను ఆదేశించింది. గత దశాబ్ద కాలంలో పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సాధారణంగా పెద్దలలో అధికంగా కనిపించే డయాబెటిస్‌ ఇప్పుడు..

CBSE Schools: సీబీఎస్సీ స్కూళ్లలో 'షుగర్ బోర్డులు' ఏర్పాటు చేయాలని హుకూం.. ఎందుకంటే?
CBSE Schools
Srilakshmi C
|

Updated on: May 18, 2025 | 10:43 AM

Share

హైదరాబాద్‌, మే 18: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), దాని అనుబంధ పాఠశాల్లో పిల్లల చక్కెర తీసుకోవడం పర్యవేక్షించడానికి, దాని వినియోగాన్ని తగ్గించడానికి షుగర్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్సీ అధికారులను ఆదేశించింది. గత దశాబ్ద కాలంలో పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సాధారణంగా పెద్దలలో అధికంగా కనిపించే డయాబెటిస్‌ ఇప్పుడు పిల్లల ఆరోగ్యాన్నీ కబలిస్తోంది. ఈ పరిస్థితిని కంట్రోల్‌ చేయాలని సీబీఎస్సీ బోర్డు పేర్కొంది. ఈ ఆందోళనకరమైన ధోరణికి ఎక్కువగా చక్కెర తీసుకోవడం కారణమని, తరచుగా పాఠశాల పరిసరాలలో చక్కెర స్నాక్స్, పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు సులభంగా లభించడం వల్ల ఇలా జరుగుతుంది. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా ఊబకాయం, దంత సమస్యలు, ఇతర జీవక్రియ రుగ్మతలకు దోహదం చేస్తుంది. చివరికి పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యం, విద్యా పనితీరును ప్రభావితం చేస్తుందని CBSE పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో సీబీఎస్సీ పేర్కొంది.

అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే సమాచారాన్ని ప్రదర్శించడానికి ఆయా స్కూళ్లలో ‘షుగర్‌ బోర్డులు’ ఏర్పాటు చేయాలని సీబీఎస్సీ పాఠశాలలను కోరింది. ఈ బోర్డుల్లో రోజువారీ చక్కెర వినియోగం గురించి వివరించాలి. సాధారణంగా తీసుకునే ఆహారాలలో అంటే జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన అనారోగ్యకరమైన ఆహారాల్లో చక్కెర కంటెంట్ అధిక చక్కెర వినియోగంతో పొంచి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు, ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందించాలి. ఇది విద్యార్థులకు సమాచారంతో కూడిన ఆహార ఎంపికల గురించి అవగాహన కల్పిస్తుంది. విద్యార్థులలో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహిస్తుందని CBSE పేర్కొంది.

నాలుగు నుంచి పదేళ్ల వయస్సు గల పిల్లలకు రోజువారీ కేలరీలు తీసుకోవడంలో రక్తంలో చక్కెర 13 శాతం, 11 నుంచి 18 యేళ్ల వయస్సు గల వారికి 15 శాతం ఉంటుందని, ఇది సిఫార్సు చేయబడిన 5 శాతం పరిమితిని గణనీయంగా మించిందని బోర్డు తెలిపింది. పాఠశాల పరిసరాలలో లభించే చక్కెర స్నాక్స్, పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను అధిక తీసుకోవడమే ఈ పరిస్థితికి దోహదం చేస్తుందని బోర్డు పేర్కొంది. జూలై 15 లోపు పాఠశాలలు సంక్షిప్త నివేదిక అందించాలని, అలాగే కొన్ని ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాలని CBSE ఆదేశించింది. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించాలని పాఠశాలలను కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?