AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాల కోసం ఇలా రిజిస్టర్ చేసుకొండి..

PM Kisan: దేశంలోని అన్నదాతల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ స్కీమ్ ద్వారా

PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాల కోసం ఇలా రిజిస్టర్ చేసుకొండి..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2021 | 8:08 AM

Share

PM Kisan: దేశంలోని అన్నదాతల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి 100 శాతం వరకు నిధులు రైతులకు అందచేయనుంది. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న, యాజమాన్యాన్ని కలిగి చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6000 ఆదాయాన్ని ఈ పథకం ద్వారా ఇవ్వనుంది. అయితే ఇవి ఒకేసారి రైతుల ఖాతాలోకి రావు. విడతల వారిగా అన్నదాతలకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందవచ్చు. ఇక ఇటీవల ప్రధాని మోదీ పీఎం కిసాన్ 9వ విడత నగదును విడుదల చేసాడు. 2021 ఆగస్ట్ 9న రూ. 19,500 కోట్లకు పైగా నేరుగా 9.75 కోట్ల లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకం కోసం వివిధ మినహాయింపు వర్గాలు ఉన్నాయి. రైతులు తమ స్థితిని పీఎం కిసాన్ ఆన్ లైన్ పోర్టల్ www-pmkisan-gov-in లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ ప్రయోజనాలు కోసం రిజిస్టర్ ఎలాగంటే.. 1. పేరు, వయస్సు, జెండర్, వర్గం (ఎస్సీ, ఎస్టీ) 2. ఆధార్ నంబర్ (అస్సాం, మేఘాలయ, J & K (ఇప్పుడు J&K,Ladakhల UT లు)) రాష్ట్రాల రైతులు మినహా చాలా మంది పౌరులకు ఆధార్ నంబర్ జారీ చేయలేదు. అందువలన ఈ రాష్ట్రాలు మినహాయించారు.

ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆధార్ నంబర్ అందుబాటులో ఉన్న లబ్ధిదారులు రిజిస్టర్ చేసుకోవచ్చు.. ఇతరుల కోసం ఆధార్ నంబర్, ఏదైనా నిర్ధేశిత పత్రాలు వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు గుర్తింపు ధృవీకరణ ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయంగా సూచించిన పత్రాలను సమర్పించాలి. అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్ట్, ఎన్ఆర్ఈజీఎ జాబ్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర, యూటి ప్రభుత్వాలు లేదా అందుకు సంబంధించిన అధికారులు జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు పత్రాలను అందజేయాలి. 3. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్. 4. మొబైల్ నంబర్, తప్పనిసరి కాదు. కానీ ఫోన్ నంబర్ జతచేయడం వలన నోటిఫికేషన్స్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు దేశంలోని రైతులకు లక్షా 60 రూపాయాలు అందించారు. కోవిడ్ సంక్షోభంలోనూ చిన్న రైతులకు రూ. లక్ష కోట్లు బదిలీ అయ్యాయి.

Also Read: SR Kalyana Mandapam: ఓటీటీలోకి సూపర్ హిట్ ఎస్ఆర్.కళ్యాణ మండపం.. రిలీజ్ ఎప్పుడంటే..

Brahma Muhurta: పెద్దలు బ్రాహ్మీముహర్తంలో నిద్రలేవమని చెబుతారు ఎందుకో తెలుసా.. అలా నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో

Adah Sharma: మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ అదా శర్మ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది.. ఇంతకూ ఏం చేసిందో తెలుసా..

Manchi Rojulochaie : ‘మంచి రోజులొచ్చాయి’ నుంచి అందమైన మెలోడీ వచ్చింది.. అద్భుతంగా ఆలపించిన సిద్ శ్రీరామ్..