AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NITI Aayog CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్‌.. జూన్‌ 30తో ముగియనున్న అమితాబ్ కాంత్ పదవీకాలం..

నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్‌ నియమితులయ్యారు. జూన్ 30తో పదవీకాలం ముగియనున్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

NITI Aayog CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్‌.. జూన్‌ 30తో ముగియనున్న అమితాబ్ కాంత్ పదవీకాలం..
Parameshwaran Ayyar
Srinivas Chekkilla
|

Updated on: Jun 25, 2022 | 7:37 AM

Share

నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్‌ నియమితులయ్యారు. జూన్ 30తో పదవీకాలం ముగియనున్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయ్యర్ పదవీకాలం రెండేళ్లు ఉంటుందని సిబ్బంది, శిక్షణ శాఖ తెలిపింది. అమితాబ్ కాంత్ 17 ఫిబ్రవరి 2016 న NITI ఆయోగ్ CEO గా నియమితులయ్యారు. ప్రారంభంలో అతని పదవీకాలం 2 సంవత్సరాలు. ఆ తర్వాత అతని సర్వీస్‌ను చాలాసార్లు పొడిగించారు. అయ్యర్ యూపీ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అతను నీరు, పారిశుద్ధ్య కార్యదర్శిగా పని చేశారు. ఈ రంగంలో నిపుణుడిగా గుర్తింపు పొందాడు. అతను ఈ రంగంలో నిపుణుడిగా ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశాడు. 2009లో ఐఏఎస్‌కు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. హర్ ఘర్ జల్ యోజన, పరిశుభ్రత ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రాధాన్యతలలో చేర్చారు. NITI ఆయోగ్ ద్వారా, ప్రాథమిక సేవలు మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరుకోవడానికి ప్రభుత్వం వారి అనుభవాన్ని ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. 63 ఏళ్ల అయ్యర్ శ్రీనగర్‌లో జన్మించారు. డూన్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను అభ్యసించారు.

ఆ తర్వాత అతను సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీ, డేవిడ్‌సన్ కాలేజ్ నార్త్ కరోలినా అమెరికా నుంచి తన తదుపరి చదువులు చదివాడు. అయ్యర్ 1981లో IAS అయ్యాడు. 2009లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రపంచ బ్యాంకు నీరు, పారిశుద్ధ్య కార్యక్రమంలో చేరాడు. 2016 సంవత్సరంలో అయ్యర్ స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పని చేశారు. దేశంలో బహిరంగ మలవిసర్జన నిర్మూలన లక్ష్యంగా ఆయన పని చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, మురుగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించారు. అయ్యర్ పర్యవేక్షణలో ఘన వ్యర్థాల నిర్వహణ బాగా మెరుగుపడింది. 2020 సంవత్సరంలో అయ్యర్ ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రపంచ బ్యాంకులో చేరారు.