రూ.1.20 లక్షల కోట్ల వ్యయంతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం..! సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం
కేంద్రం రూ. 1.20 లక్షల కోట్లతో ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ మధ్య కొత్త ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తోంది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది, ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ట్రాఫిక్ను తగ్గిస్తుంది. పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి ఈ హై-స్పీడ్ కారిడార్ కీలకం కానుంది.

ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీ పెంపునకు సంబంధించి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఏకంగా రూ. 1.20 లక్షల కోట్ల వ్యయంతో ఈ ఎక్స్ప్రెస్వే పనులు చేపట్టనున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్ను ఉత్తరాఖండ్తో కలుపుతుంది. పూర్తయిన తర్వాత రాబోయే కొత్త హై-స్పీడ్ కారిడార్ రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని భారీగా తగ్గించనుంది. ఇది ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చనుంది.
ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తి అయితే ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య కీలక మార్గాల్లో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధిలో వృద్ధి కనిపిస్తుంది. అత్యంత వ్యూహాత్మక మార్గం గుండా వెళుతున్న ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్ వంటి ప్రధాన జిల్లాల గుండా వెళ్తుంది. తరువాత ఇది ఉత్తరాఖండ్ వైపు తిరిగి ఉధమ్ సింగ్ నగర్, కాశీపూర్, ఖతిమా వంటి ప్రధాన నగరాల గుండా వెళుతుంది. రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్ను బలోపేతం చేయడం ఈ మార్గం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం.
ఈ ఎక్స్ప్రెస్వే మొత్తం ప్రతిపాదిత పొడవు సుమారు 240 నుంచి 260 కిలోమీటర్లు. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా దీన్ని డిజైన్ చేయనున్నారు. పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గిపోతుంది. ఇప్పుడు 5 నుంచి 6 గంటలు పట్టే ప్రయాణాలకు నిర్మాణం పూర్తి అయితే 2.5 నుండి 3 గంటలు పడుతుంది. ఈ రాబోయే ఎక్స్ప్రెస్వే వాతావరణానికి గణనీయంగా నిరోధకతను కలిగి ఉంటుందని, అదే సమయంలో భారీ ట్రాఫిక్ ఉన్న ప్రస్తుత రహదారులపై భారాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
