AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: భారతదేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు.. ఖర్చు రూ. 83,000 కోట్లు.. ఆ మార్గంలోనే పరుగులు!

Bullet Train: కారిడార్ సిద్ధమైన తర్వాత ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం 1 గంట 58 నిమిషాలకు తగ్గుతుందని రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ అన్నారు. 2027 ఆగస్టులో జరిగే మొదటి ఆపరేషనల్ రన్ 100 కి.మీ సూరత్-వాపి స్ట్రెచ్‌కు పరిమితం చేయనున్నట్లు ఆయన అన్నారు..

Bullet Train: భారతదేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు.. ఖర్చు రూ. 83,000 కోట్లు.. ఆ మార్గంలోనే పరుగులు!
Subhash Goud
|

Updated on: Nov 27, 2025 | 11:04 AM

Share

Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ వేగం బలంగా ఉందని తాజా ప్రభుత్వ డేటా చెబుతోంది. భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) నెలవారీ ప్రాజెక్టు పర్యవేక్షణ ఫ్లాష్ నివేదిక ప్రకారం.. 508 కి.మీ కారిడార్ ఇప్పుడు 55 శాతం భౌతిక పురోగతిని దాటింది.

MoSPI ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్ (PAIMANA) పోర్టల్ కింద పర్యవేక్షిస్తున్న ప్రధాన ప్రాజెక్టులలో హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ఒకటి. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.82,968 కోట్లు ఖర్చు చేశారు. ఇది పూర్తయ్యే సమయానికి దాదాపు రూ.1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

ఇవి కూడా చదవండి

గత వారం ప్రారంభంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో సూరత్- వాపి మధ్య ప్రారంభ 100 కి.మీ ప్రయాణం ప్రారంభిస్తుందని ప్రకటించినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ విభాగం 508 కి.మీ. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్‌లో భాగం. దీనిని ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది 2029 నాటికి పూర్తిగా పనిచేయగలదని భావిస్తున్నారు.

కారిడార్ సిద్ధమైన తర్వాత ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం 1 గంట 58 నిమిషాలకు తగ్గుతుందని రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ అన్నారు. 2027 ఆగస్టులో జరిగే మొదటి ఆపరేషనల్ రన్ 100 కి.మీ సూరత్-వాపి స్ట్రెచ్‌కు పరిమితం చేయనున్నట్లు ఆయన అన్నారు. “హై-స్పీడ్ రైలు కారిడార్ పూర్తయిన తర్వాత బుల్లెట్ రైలు అహ్మదాబాద్ – ముంబై మధ్య దూరాన్ని కేవలం 1 గంట 58 నిమిషాల్లోనే చేరుకోవడం ఒక ముఖ్యమైన మైలురాయి. ఆగస్టు 2027లో ప్రారంభమయ్యే ఈ రైలు ట్రయల్‌  సూరత్ – వాపి మధ్య 100 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని మంత్రి తెలిపారు.

Zodiac Sign: ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నెల ఎంతో అదృష్టం.. జీవితాల్లో ఎన్నో అద్భుతాలు

508 కిలోమీటర్ల కారిడార్‌లో రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని మంత్రి తెలిపారు. నాలుగు స్టాపులతో ముంబై-అహ్మదాబాద్ ట్రిప్ 1 గంట 58 నిమిషాలు పడుతుందని, మొత్తం 12 స్టేషన్లలో ఆగితే ప్రయాణం 2 గంటల 17 నిమిషాలకు పెరుగుతుందని చెప్పారు. ఈ బుల్లెట్ రైలు ముంబై –  అహ్మదాబాద్ మధ్య దూరాన్ని నాలుగు స్టాప్‌లతో 1 గంట 58 నిమిషాల్లో కవర్ చేస్తుంది. అయితే ఇది మొత్తం 12 స్టేషన్లలో ఆగితే మొత్తం ప్రయాణ సమయం 2 గంటల 17 నిమిషాలు అవుతుంది ” అని మంత్రి వైష్ణవ్ చెప్పారు. పూర్తి కారిడార్ డిసెంబర్ 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే 2027 ఆగస్ట్‌లో వంద కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సూరత్‌లో పురోగతిని సమీక్షించారని, రైలు, ఇతర జాతీయ మౌలిక సదుపాయాల రంగాలలో ప్రాజెక్టు ఆవిష్కరణలను పునరావృతం చేయాలని ప్రోత్సహించారని ఆయన అన్నారు.

Maruti Car: మారుతి ఆల్టో కంటే చౌకైగా.. కేవలం రూ.3.5 లక్షలకే సరికొత్త 5 సీట్ల కారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి