Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూరలో విషం కలిపి కోడలికి పెట్టిన అత్తింటివారు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. జ్యోతి అనే వివాహితను అత్తింటి వారు దారుణంగా చంపేశారు. ఆమె తినే కూరలో విషం కలిపి హత్య చేశారు. భర్త, మరిది, అత్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూరలో విషం కలిపి కోడలికి పెట్టిన అత్తింటివారు..
Death
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2023 | 10:09 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. జ్యోతి అనే వివాహితను అత్తింటి వారు దారుణంగా చంపేశారు. ఆమె తినే కూరలో విషం కలిపి హత్య చేశారు. భర్త, మరిది, అత్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కంచికచర్లకు చెందిన వ్యక్తితో జ్యోతికి వివాహం జరిగింది. వివాహం తరువాత జ్యోతి అత్తింట్లోనే ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా భర్త, అత్త, మరిది కలిసి జ్యోతిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వారు ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. జ్యోతి తినే కూరలో విషం కలిపారు. తీవ్ర అస్వస్థకు గురైన జ్యోతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అత్తింటి వాళ్లు కూరలో విషం కలిపారని జ్యోతి వాంగ్మూలం ఇచ్చింది. ఆ తరువాత చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయింది. పాయిజన్ కారణంగానే జ్యోతి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

జ్యోతి వాంగ్మూలం, వైద్యుల ధృవీకరణ మేరకు.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భర్త, మరిది, అత్తను అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..