Venkaiah Naidu: శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు వినతి..
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తిరుమల శ్రీవారిని ( Tirumala Srivari Temple) దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తిరుమల శ్రీవారిని ( Tirumala Srivari Temple) దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ‘ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నాను. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ శ్రీవారిని దర్శించుకోండి. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయి. భక్తులు సంవత్సరంలో ఒకసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోండి. దీని వల్ల అందరికీ స్వామి దర్శన భాగ్యం లభిస్తోంది’ అని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
నేడు మనవరాలి వివాహం..
కాగా ఉపరాష్ట్రపతి మనవరాలు సుష్మ నేడు (ఫిబ్రవరి10) పెళ్లిపీటలెక్కనుంది. పుష్పగిరి మఠంలో నిరాడంబరంగా ఈ వివాహం జరగనుంది. అందుకే పెళ్లి ముందే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నిన్న తిరుపతికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, ఇతరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన భవనంలోకి తీసుకెళ్లారు. కాగా వెంకయ్య నాయుడు మనవరాలి వివాహం సందర్భంగా వివాహ వేదిక పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Also Read:Bangarraju: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న బంగార్రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్లోనే అతిపెద్ద డీల్