AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి అద్భుతమైన సినిమాలు చేశారు. 200కు పైగా సినిమాలు చేసి చరిత్ర సృష్టించారు.

టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 8:48 AM

Share

ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కొందరు విలన్స్ గా మారి ఆడియన్స్ ను భయపెడుతుంటే మరికొంతమంది తండ్రి, మామ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ గా రాణించాడు. 200కు పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అప్పటిలో ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కు క్యూ కట్టేవారు ఆడియన్స్. ఆయన సినిమా వస్తుందంటే మినీమన్ గ్యారెంటీ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయేవారు. సీరియస్ రోల్స్ లో నటిస్తూనే కామెడీతోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు. తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నారు. ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పని చేశారు ఆయన. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నాడు. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కు విపరీతమైన ఫాన్స్ ఉన్నారు.

ఇండస్ట్రీకి ఆయన ఏకంగా 41 మంది హీరోయిన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. అంతే కాదు దాదాపు 21ఏళ్లు ఉత్తమ నటుడిగా ఉన్నారు ఆయన. ఆయన మరెవరో కాదు నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రాజేంద్ర ప్రసాద్ డబ్బిగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారారు. దాదాపు 200కు పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు రాజేంద్రప్రసాద్.

ఇక ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికీ తన కామెడీతో ఇప్పటికీ నవ్వులుపుయిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. తెలుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ది ఓ అద్భుతమైన ప్రస్థానం.. కామెడీ హీరోగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు ఆయన. అలాగే టాలీవుడ్ కు  41మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. కామెడీ హీరోగా ఏకంగా 21ఏళ్లు ఉత్తమ నటుడిగా నిలిచారు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాలను ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Rajendra Prasad

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us