Andhra Pradesh Elections: బాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయింది.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ కూటమి.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా.. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు.

Andhra Pradesh Elections: బాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయింది.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Sajjala Ramakrishna Reddy
Follow us

|

Updated on: May 28, 2024 | 9:15 PM

ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ కూటమి.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా.. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఉత్తరాదిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు దక్షిణాదిలో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చంటూ పేర్కొన్నారు.

ఇక బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందని సజ్జల అన్నారు. ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ముందే సీఎస్‌ను తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదన్నారు. మిగతా చోట్ల ధ్వంసమైన ఈవీఎంల వీడియోలు ఎక్కడ..? నిబంధనలకు విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇచ్చారంటూ పేర్కొన్నారు.

ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.. మాచర్లలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ సజ్జల పేర్కొన్నారు. సీఎస్‌ను తప్పించాలన్న కుట్రతో ఆరోపణలు చేస్తున్నారు.. 10 రోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా ? వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుంది.. అంటూ సజ్జల పేర్కొన్నారు.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఈసీ ఇచ్చిన ప్రత్యేక గైడ్‌లైన్స్‌పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌లైన్స్ ఎలా ఇస్తారని అన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

మొత్తానికి ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ.. ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. మరి… కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేనాటికి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!