AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో దొరుకుతున్న వజ్రాలు రైతుల పంట పండిస్తున్నాయి. జొన్నగిరిలో అత్యంత విలువైన వజ్రాలు దొరకుతున్నాయి.

Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది
Kurnool District Diamond
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2021 | 5:43 PM

Share

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో దొరుకుతున్న వజ్రాలు రైతుల పంట పండిస్తున్నాయి. జొన్నగిరిలో అత్యంత విలువైన వజ్రాలు దొరకుతున్నాయి. తాజాగా  నాగరాజు అనే రైతుకు జాక్‌పాట్ తగిలింది. పొలంలో విత్తనాలు వేస్తుండగా లక్షలు విలువచేసే వజ్రం కంటపడింది. స్థానిక వ్యాపారి ఆ వజ్రాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ అరుదైన వజ్రాన్ని కొనుగోలు చేయడానికి స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారులు పోటీ పడ్డారని తెలుస్తోంది. అయితే కోట్లాడి రూపాయలు విలువ చేసే వజ్రాన్ని స్థానిక వ్యాపారి త్వరపడటంతో తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో తరచుగా వజ్రాలు లభ్యమౌతున్న విషయం తెలిసిందే. వర్షాలు పడుతున్న కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు బయటపడతాయి.  వజ్రాల కోసం స్థానికులతో పాటు కర్నాటక జిల్లాల నుండి కూడా వచ్చి వెతుకుతుంటారు. మరోవైపు వజ్రాల వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వజ్రాల వేలం పాటలు సీక్రెట్‌గా జరుగుతుండటం.. వజ్రం దొరికిందన్న ప్రచారం తప్ప ఎక్కడా రుజువులు లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతున్నారు.

కాగా ఈ ఏడాది మే నెలలో ఓ రైతుకు కోట్లాది రూపాయలు విలువ చేసే వజ్రం దొరికినట్టు తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరకడంతో దానిని పరీక్షించారు. అది 30 క్యారెట్ల వజ్రంగా తేలడంతో వ్యాపారులు అతడి వద్దకు క్యూ కట్టారు. దాదాపు రూ.3కోట్లు విలువ చేసే వజ్రాన్ని రూ.కోటి 20లక్షలు కొనుగోలు చేశారు.

Also Read: ఏపీ విద్యార్థులకు బంపరాఫర్‌.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న ప్రభుత్వం. అయితే..

ఎండకు తట్టుకోలేకపోయిన ఎలుగుబంటి.. ఐస్ గడ్డను చూసి ఏం చేసిందంటే.. వైరల్ అవుతన్న ఫన్నీ వీడియో..!