Krishna University: కేంద్రానికి వెళ్లకుండానే పరీక్షలు.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో అవకతవకలు
కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో(Practical Exams) అవకతవకలు జరిగాయి. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మొదటి నుంచి విమర్శలు...
కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో(Practical Exams) అవకతవకలు జరిగాయి. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. పలువురు వర్సిటీకి ఫిర్యాదులు(Complaint) చేశారు. వారి ఫిర్యాదుతో అధికారులు ఒక తనిఖీ బృందాలను నియమించి ఆకస్మిక తనిఖీలు చేయించారు. ఈ సోదాల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లాలోని(Krishna District) 97 పరీక్షా కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న ప్రారంభమైన పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 12,550 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. చాలా చోట్ల విద్యార్థులు అసలు పరీక్ష కేంద్రానికే వెళ్లకుండా తరగతి గదిలోనే ఉన్నట్లు బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించకుండానే జరిగినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు తనిఖీ బృందాలు గుర్తించారన్న అంశం విశ్వవిద్యాలయవర్గాల్లో సంచలనంగా మారింది.
కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ వెసులుబాటు యాజామాన్యాలకు కలిసివచ్చినట్లయ్యింది. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన యాజమాన్యాలు ఒక్కొక్కరి నుంచి నగదు తీసుకుని మార్కులు తామే వేస్తామని చెప్పారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం తనిఖీ బృందాలు కేంద్రాల వారీగా పరిశీలించిన అంశాలతో నివేదిక తయారు చేస్తున్నారు.
Also Read
Allu Arjun – Kalyan Ram: అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్లకు షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్