AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితుడిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘనుడు.. తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి..

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కిషోర్ అనే వ్యక్తి తల్లి ఇంట్లో లెకపోవడంతో తన స్నేహితుడు సతీష్ ను మందు తాగుదాం రమ్మని ఆహ్వానించాడు .. ఏమైందో ఏమో తెలియదు కాని కిషోర్ ఇంట్లో సతీష్ శవమై తేలాడు. నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కిషోర్ తల్లికి ఇంట్లో దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి..

స్నేహితుడిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘనుడు.. తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి..
Representative Image
Sudhir Chappidi
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 31, 2023 | 2:00 PM

Share

కడప జిల్లా, జూలై 31: ఇంట్లో మందు పార్టీ అరేంజ్ చేసి ప్రేమతో స్నేహితుడిని ఆహ్వానించి చంపి ఇంట్లోనే పాతి పెట్టాడు ఓ ఘనుడు.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కిషోర్ అనే వ్యక్తి తల్లి ఇంట్లో లెకపోవడంతో తన స్నేహితుడు సతీష్‌ను మందు తాగుదాం రమ్మని ఆహ్వానించాడు .. ఏమైందో ఏమో తెలియదు కాని కిషోర్ ఇంట్లో సతీష్ శవమై తేలాడు. నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కిషోర్ తల్లికి ఇంట్లో దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సుమారు నెల రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్ళిన సతీష్ శవమై తేలాడు. నెల రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళిన కిషోర్ తల్లి ఆదివారమే తిరిగి ప్రొద్దుటూరు వచ్చింది. ఈ క్రమంలో తనకు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుడటంతో కిషోర్‌ను ఏం జరిగిందంటూ తల్లి గట్టిగా ప్రశ్నించింది. సతీష్‌ను చంపి ఇంట్లో పూడ్చినట్లు కిషోర్ తన తల్లికి చెప్పడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారించగా సతీష్‌ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు కిషోర్ ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం