AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోందీ అందాల తార. స్టార్ హీరోలలో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. అయితే ఈ స్టార్ హీరోయిన్ గత ఎనిమిదేళ్లుగా వాట్సప్ కు దూరంగా ఉంటోంది. ఎందుకంటే?

Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
Rajisha Vijayan
Basha Shek
|

Updated on: Feb 12, 2026 | 10:18 PM

Share

ఇప్పుడు మన జీవితాల్లో మొబైల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఇది లేకుండా ఒక్క నిమిషమైనా  బతకలేం అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, స్టేటస్ లను చెక్ చేసుకుంటారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సమయం అనేది తెలీయకుండా గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడుపుతాం. అయితే ఈ స్టార్  హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను అవలంభిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ సామాజిక మాధ్యమాలకు చాలా దూరంగా ఉంటోందట. ముఖ్యంగా మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్  లైఫ్ లో కీలకమైన వాట్సాప్ ను గత ఎనిమిదేళ్లుగా ఉపయోగించడం లేదట.  అలాగే కాలేజీ చదువు పూర్తయినవెంటనే ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేసిందట. ప్రస్తుతం కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే .. అది కూడా చాలా అరుదుగా యూజ్ చేస్తోందట. వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితమే ముఖ్యమని భావిస్తోన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు రజిషా విజయన్.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించే రజిషా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మోహన్ లాల్ నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ కాలంకావల్ లోనూ ఓ కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ.  సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ  తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సామాజిక మాధ్యమాల వినియోగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రజిషా విజయన్ లేటెస్ట్ ఫొటోస్..

‘మనుషులను ప్రత్యక్షంగా కలవడం చాలా విలువైన విషయం. ఫోన్ కాల్స్ లేదా మెసేజీల కంటే ముఖాముఖి మాట్లాడటం ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది అని నేను భావిస్తాను. షార్ట్స్, రీల్స్ వల్ల చాలా మంది ఫోన్లకు బానిసవుతున్నారు. సమయం ఎంత ముఖ్యమో మనం గుర్తించలేకపోతున్నాము. వీటి బదులు మంచి సినిమాలు చూడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులతో గడపవచ్చు’ అని రజిషా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..