మొన్న సల్మాన్ ఖాన్.. నిన్న రోహిత్శెట్టి.. ఇప్పుడు రణ్వీర్సింగ్.. గ్యాంగ్స్టర్స్ గుప్పిట్లో మళ్లీ ముంబై!
భయం నీడలో బాలీవుడ్ . ఒకప్పుడు అండర్వరల్డ్ మాఫియాతో బిక్కుబిక్కుమని బతికిన బాలీవుడ్, ఇప్పుడు కనిపించని గ్యాంగ్ వార్నింగ్లతో క్షణక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. గతంలో సల్మాన్ఖాన్, తర్వాత షారూఖ్ఖాన్, మొన్న రోహిత్శెట్టి, ఇప్పుడు రణ్వీర్ సింగ్...డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే సరేసరి. లేకుంటే అంతమే మరి..అన్నట్టుగా వసూళ్ల బెదిరింపులకు దిగిందో గ్యాంగ్.ఇంతకూ బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసిన ఆషాడో గ్యాంగ్ ఎవరు..?

రణ్వీర్సింగ్ను రూ.3 నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వాయిస్నోట్ వచ్చినట్లు తెలుస్తోంది. రణ్వీర్సింగ్ ఇంటివద్ద రెక్కీ చేసి, తర్వాత వాయిస్ నోట్ పంపినట్లు అనుమానిస్తున్నారు. వారం కిందట బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈఘటన ముంబైను కుదిపేసింది. ఇది జరిగి రెండువారాలైనా షూటర్ ఎవరో ఇంకా గుర్తించలేదు. రోహిత్ శెట్టి కాల్పుల వెనుక వసూళ్ల కోణం ఉందా అనే అనుమానం బలపడుతోంది. సెలబ్రిటీల ఇళ్ల చుట్టూ అనుమానాస్పద కదలికలు గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది జరిగిన రెండువారాలకు రణ్వీర్ సింగ్ను బెదిరించినట్లు వార్తలు రావడం బాలీవుడ్ జనాలను భయపెడుతోంది. బాలీవుడ్ స్టార్లకు బెదిరింపులు కొత్త విషయం కాదు.సల్మాన్ ఖాన్కు గతంలో ఇలాంటి బెదిరింపులను ఎన్నో ఎదుర్కొన్నాడు. కోట్ల రూపాయల డిమాండ్ ఈ కేసుల్లో కామన్ పాయింట్గా కనిపిస్తోంది. గత 15రోజుల్లో దాదాపు 12మంది సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. కానీ బెదిరింపు కాల్స్పై బాలీవుడ్ మౌనంగా ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో నమోదు FIR కూడా నమోదు కాలేదు. రోహిత్శెట్టి కాల్పుల ఘటన తర్వాతే ఎక్స్టార్షన్ కాల్స్ ఎక్కువైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇప్పుడు అన్నోన్ నంబర్లను బాలీవుడ్ సెలబ్రిటీలు బ్లాక్ చేస్తున్నారు. రణ్వీర్సింగ్ అన్నోన్ నంబర్స్ బ్లాక్ చేయడంతోనే.. తన సెక్రటరీకి వాయిస్ నోట్ పంపినట్లు తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్కూ ఇదే వతరహా బెదిరింపులొచ్చాయి....
