AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manyam district: డ్యాన్స్ చేస్తూ తూలి పడిపోయాడేమో అనుకున్నారు.. కానీ లేవకపోవడంతో..

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో విషాదం నెలకొంది. ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి వేడుక ఊరేగింపులో స్నేహితులతో డాన్స్ చేస్తూ బంగారు నాయుడు అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. డీజే సౌండ్‌కు బంగారు నాయుడు గుండె ఆగిపోయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Manyam district: డ్యాన్స్ చేస్తూ తూలి పడిపోయాడేమో అనుకున్నారు.. కానీ లేవకపోవడంతో..
Heart Attack Death
S Srinivasa Rao
| Edited By: |

Updated on: May 16, 2025 | 10:51 AM

Share

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఓ పెళ్లివేడుకలో విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో సుంకరి బంగారు నాయుడు అనే 38 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు బంగారు నాయుడు పెయింటింగ్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తూ విద్యాకమిటి చైర్మన్‌గా, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పక్కింట్లో బందువుల కుర్రాడి పెళ్లికి అంతా తానై నిలిచాడు బంగారు నాయుడు. గురువారం తెల్లవారు జామున దగ్గరుండి డిజె సౌండ్ల మధ్య ఊరేగింపును నిర్వహించాడు. ఊరేగింపు చివరికి వచ్చిన సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి తానూ స్టెప్పులేసాడు. అలా స్టెప్పులు వేస్తుండగానే గ్రామస్తుల కళ్లముందు కుప్పకూలిపోయాడు. మొదట తూలి పడిపోయాడని అతనితో కలిసి డ్యాన్స్ చేసిన స్నేహితులు భావించారు. కిందపడిన వ్యక్తిని పైకి లేపే క్రమంలో బంగారు నాయుడు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఒక్కసారి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. D.Jల చప్పుడు, సరిపడ నిద్ర లేక అప్పటికే బాగా అలసటగా ఉన్న బంగారు నాయుడు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించినప్పట్టికి అప్పటికే అతను మృతి చెందాడు.

వీడియో దిగువన చూడండి… 

గ్రామంలో ఏ ఇంట పెళ్లి పేరంటాలు జరిగిన, చావు పుట్టుకలు జరిగినా బంగారు నాయుడు ముందుంటాడు అని గ్రామస్తులు చెబుతున్నారు. ఏ ఫంక్షన్ జరిగిన ముందుంటూ ఆర్గనైజ్ చేసే వ్యక్తని, గ్రామస్తులను సమీకరించి వారితో సమన్వయం చేస్తూ కార్యక్రమంకి చేదోడు వాదోడుగా ఉంటాడని అంటున్నారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు గ్రామస్తులు తీవ్ర శోకంలో ములిగిపోయారు. కళ్ళముందే ఉండే మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాసూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.