AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Lakshminarayana: కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. స్వయంగా వరినాట్లు

వ్యవసాయదారుడికి అండగా ఉండేలా మాజీ జేడీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రైతులు సహజ సిద్ధమైన పద్దతులతో,సేంద్రియ విధానంలో పంటలు పండించే విధంగా తాను స్వయంగా హలం పట్టి పొలంలోకి దిగారు. వ్యవసాయం చేస్తున్నారు. 

JD Lakshminarayana: కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. స్వయంగా వరినాట్లు
Jd Lakshminarayana Farming
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2022 | 12:57 PM

JD Lakshminarayana: స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయింది. జైకిసాన్.. రైతే రాజు.. రైతు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు, ప్రభుత్వాలు చెప్పేమాట. మనదేశం అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే భారంగా మారింది. భూమిని కన్న బిడ్డగా భావించి.. ప్రకృతి ప్రళయాలు వంటి అనేక పరిస్థితులను తట్టుకుని మానవాళికి అన్నం పెడుతున్న అన్నదాతలకు తినడానికి తిండి లేక, కనీస సదుపాయాలు లేక.. అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే వ్యవసాయదారుడికి అండగా ఉండేలా మాజీ జేడీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రైతులు సహజ సిద్ధమైన పద్దతులతో,సేంద్రియ విధానంలో పంటలు పండించే విధంగా తాను స్వయంగా హలం పట్టి పొలంలోకి దిగారు. వ్యవసాయం చేస్తున్నారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం, రాచపల్లి గ్రామంలో మాజీ సిబిఐ జెడి వి వి లక్ష్మీనారాయణ 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ పద్దతిలో పంట పండించనున్నారు. ఈరోజు తాను  కౌలుకు తీసుకున్న చేలో వి వి లక్ష్మీనారాయణ స్వయంగా వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, జేడీ అభిమానులు కూడా పాల్గొని.. వరి నాట్లు వేశారు. ఇలాంటి సంఘటన సర్వసాధారంగా సినిమాల్లోనే చూస్తాం.. నిజ జీవితంలో అరుదు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..