AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ఉత్తరాంధ్ర నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక సమావేశం.. చర్చించిన అంశాలివే..

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర‎పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో మళ్ళీ తిరిగి పాగవేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా 2019 ఫలితాలకు ఏమాత్రం తగ్గకుండా త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా అడుగులు వేస్తోంది.

YSRCP: ఉత్తరాంధ్ర నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక సమావేశం.. చర్చించిన అంశాలివే..
Cm Jagan
S Haseena
| Edited By: |

Updated on: Mar 09, 2024 | 8:26 PM

Share

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర‎పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో మళ్ళీ తిరిగి పాగవేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా 2019 ఫలితాలకు ఏమాత్రం తగ్గకుండా త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా అడుగులు వేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఇక ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమై వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలే దాదాపుగా అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉందని అందులో భాగంగానే ప్రత్యేకంగా వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం తరువాత ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో మార్పులు ఉండబోవని సమావేశానికి హాజరైన వారే దాదాపు అభ్యర్థులనే సంకేతాలను బలంగా ప్రజల్లోకి తీసుకుళ్లే ప్రయత్నం చేసింది. ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్న ప్రచారానికి చెక్ పెట్టడం కోసమని అంటుంది వైసిపి అధిష్టానం. పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయం మొత్తం ఉత్తరాంధ్ర ,అమరావతి కేంద్రంగా తిరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని నిరోధించేలా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని సజ్జలరామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక పొత్తులకు సంబంధించిన అంశంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధైర్యం చెప్పారు. అయితే నేతలంతా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలు చేయడం మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్లు సమీక్షలు చేయడం మాత్రమే జరిగిందని.. రాబోయే నెల రోజులు అత్యంత కీలకమని ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నాటి నుంచి ప్రతి నాయకుడు కార్యకర్తల్లో ఉండాలని సూచించారు ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ వైవి సుబ్బారెడ్డి. తాను ఇప్పటికే విశాఖ కేంద్రంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నానని ఇకపై సమీక్షలు ఉండే అవకాశం లేదని పూర్తి బాధ్యతలను నేతలే భుజానికి ఎత్తుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో పోల్ మేనేజ్మెంట్, బూత్ కమిటీల బలోపేతం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు