AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం’.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు.

CM Jagan: 'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..
Cm Jagan
Srikar T
|

Updated on: May 06, 2024 | 1:05 PM

Share

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు. చంద్రబాబును నమ్మడమంటే మళ్లీ మోసపోయి కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని విమర్శించారు. ఐదేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2 లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేశామన్నారు. ఎలాంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా లబ్ది అందించామన్నారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.

నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖల మార్చేశామన్నారు. 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని, 8 నుంచి 10వ తరగతి చదువుతన్న విద్యార్థులకు ట్యాబులు ఇచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల చేతుల్లో ఎప్పుడైనా ట్యాబులు చూశారా అని అడిగారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మేలు అయినా పేదలకు గుర్తుకొస్తుందా అని ప్రజలను అడిగారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రామాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. తాను తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వచ్చే 15 ఏళ్లో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయని, వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పేదరికం మాయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..